హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి TRS పార్టీ తరపున MLC అభ్యర్థి గా బరిలో నిలిచిన సురభి వాణీదేవి నేడు గద్వాల జోగులాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సురభి వాణీదేవి గెలుపే లక్ష్యంగా జిల్లాలో ప్రచారం నిర్వహిస్తున్న రాష్ట్ర మంత్రులు V. శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి కూడా ఈ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అలంపూర్ లోని ప్రముఖ శక్తి పీఠం అయిన శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి, జోగులాంబ అమ్మవారి దేవాలయంలో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యే డా. అబ్రాహాం కూడా ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు.
మంత్రులతో బాటు ఈ పూజలో ZP చైర్ పర్సన్ సరిత TRS పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.