కడప నగరంలో ఒక న్యాయవాది ఆత్మహత్య చేసుకున్న సంఘటన కలకలం రేపుతున్నది.
కడప నగరంలోని SP ఆఫీస్ ఎదురుగా ఉన్న అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న ప్రముఖ న్యాయవాది P. సుబ్రహ్మణ్యం శెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.
తను ఉంటున్న అపార్ట్ మెంట్ పైకి ఎక్కి అక్కడ నుండి క్రిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇది చూసిన వారు వెంటనే ఆయనను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ప్రాణం పోయిందని వైద్యులు చెప్పారు.