కూకట్పల్లి సీఐగా యం.సురేందర్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ సీఐగా పనిచేస్తున్న సిఐ టి.నర్సింగరావు బదిలీ పై సిపిఓ, క్రైమ్స్ కు వెళ్ళగా, ఆ స్థానంలో యం.సురేందర్ ను నియమించారు. ఈ సందర్భంగా సీఐ సురేందర్ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పనిచేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. బాధ్యతలు స్వీకరించిన సీఐకు ఎస్ఐలు, సిబ్బంది, స్థానిక ప్రజలు కలిసి అభినందనలు తెలిపారు.