అన్నమయ్య జిల్లా రాజంపేటలో టిడ్కో ఇండ్ల ని పూర్తి చేసి లబ్ది దారులకు ఇవ్వాలని శుక్రవారం మునిసిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి ని రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి భత్యాల చెంగల రాయుడు కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎర్రబెల్లి వద్ద 5 సంవత్సరాల క్రితం 1287 టిడ్కో ఇండ్ల కోసం లబ్ధిదారులను ఎంపిక చేశారని తెలిపారు. వారి వద్ద నుంచి డిపాజిట్ కూడా కట్టించుకున్నారని, ఇప్పటి వరకు వారికి ఇండ్లు కట్టిఇవ్వలేదని అన్నారు. టిడ్కో స్థలం కోర్టు వివాదాల మూలంగా రద్దు అయినట్టు మునిసిపల్ కమిషనర్ వెల్లడించారు. లబ్ధిదారుల సొమ్ము వెనక్కి ఇవ్వమని ప్రభుత్వ ఆదేశాలు జారీచేశారని కమిషనర్ తెలిపారు. ప్రస్తుతం కోర్టు తీర్పు అనుకూలం గా వచ్చినందున డబ్బు వాపస్ వద్దని, లబ్ధిదారులకు ఇండ్లు కట్టి ఇవ్వాలని భత్యాల కోరారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోతామని కమిషనర్ వెల్లడించారు. లేదంటే వచ్చేది తమ ప్రభుత్వమే అని తమ హయాంలో లబ్ధిదారులకు న్యాయం చేస్తామని బాధితులకు మీడియా సమక్షంలో భత్యాల చెంగలరాయుడు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు డాక్టర్ సుధాకర్, అద్దెపల్లె ప్రతాప్ రాజు,డి.ఆర్.యల్.మణి, బషీర్,మందపల్లె శ్రీను,అనసూయమ్మ,తుపాకుల అశోక్ తదితరులు పాల్గొన్నారు.