30.7 C
Hyderabad
April 29, 2024 04: 15 AM
Slider నల్గొండ

కుల దురహంకార హత్యను ముక్తకంఠంతో ఖండించాలి

#MahilaSamakhya

హైదరాబాద్ నగరంలో జరిగిన హేమంత్ కుల దురహంకార హత్యను ముక్తకంఠంతో ఖండించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య సూర్యాపేట జిల్లా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం జరిగిన భారత జాతీయ మహిళా సమాఖ్య సమావేశంలో దేవరం మల్లేశ్వరి మాట్లాడుతూ హేమంత్ హత్యను తీవ్రంగా ఖండించారు.

కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఈ రాష్ట్రంలో రక్షణ కరువైందని విమర్శించారు. గతంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య తర్వాత ఇలాంటి హత్యలు పునరావృతమవుతున్నాయని అన్నారు.

వీటిని అరికట్టాలని, ప్రత్యేకించి కులాంతర వివాహాల చట్టం తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పశ్యా పిచ్చమ్మ, చెన్నగాని స్రవంతి, పులిచింతల లక్ష్మీ, రామనర్సమ్మ, పులిచింతల వెంకటరావమ్మ,  రజిత, సక్కుబాయి, ఆశ, రాములమ్మ, అనూష తదితరులు పాల్గొన్నారు.

Related posts

సుప్రీంకోర్టులో జరిగింది ఏమిటి ప్రచారం చేస్తున్నదేమిటి?

Satyam NEWS

వైశ్య ప్రముఖుడు కొత్తా వెంకటేశ్వర్లు ఇక లేరు

Satyam NEWS

నటుడు కమల్ హాసన్ కు తీవ్ర అస్వస్థత

Murali Krishna

Leave a Comment