హైదరాబాద్ నగరంలో జరిగిన హేమంత్ కుల దురహంకార హత్యను ముక్తకంఠంతో ఖండించాలని భారత జాతీయ మహిళా సమాఖ్య సూర్యాపేట జిల్లా కార్యదర్శి దేవరం మల్లేశ్వరి కోరారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సోమవారం జరిగిన భారత జాతీయ మహిళా సమాఖ్య సమావేశంలో దేవరం మల్లేశ్వరి మాట్లాడుతూ హేమంత్ హత్యను తీవ్రంగా ఖండించారు.
కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ఈ రాష్ట్రంలో రక్షణ కరువైందని విమర్శించారు. గతంలో నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య తర్వాత ఇలాంటి హత్యలు పునరావృతమవుతున్నాయని అన్నారు.
వీటిని అరికట్టాలని, ప్రత్యేకించి కులాంతర వివాహాల చట్టం తీసుకురావాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో పశ్యా పిచ్చమ్మ, చెన్నగాని స్రవంతి, పులిచింతల లక్ష్మీ, రామనర్సమ్మ, పులిచింతల వెంకటరావమ్మ, రజిత, సక్కుబాయి, ఆశ, రాములమ్మ, అనూష తదితరులు పాల్గొన్నారు.