కల్వకుర్తి పట్టణంలోని వేంకటేశ్వర స్వామి ఆలయం రహదారిలో సోమవారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కరోనా సోకిన బాధితులకు కోవిడ్-19 ఐసోలేషన్ కిట్ల పంపిణీ చేశారు.
వేంకటేశ్వర స్వామి దేవాలయం రహదారిలో ఒకే కుటుంబంలో నలుగురు వ్యక్తులకు కోవిడ్-19 సోకిన విషయం తెలుసుకున్న ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ వారు కరోనాతో బాధపడుతున్న వారి ఇంటికి వెళ్లి ఉప్పల వెంకటేష్ జెడ్పీటీసీ తలకొండపల్లి సహకారంతో ఐసోలేషన్ కిట్స్ పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు దారమోని గణేష్, ప్రసాద్, శివ తదితరులు పాల్గొన్నారు.