29.2 C
Hyderabad
May 10, 2024 02: 32 AM
Slider జాతీయం

టీఆర్ ఎస్ నుంచి బీజేపీలో చేరిన స్వామి గౌడ్

#JPNadda

తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.

కొంతకాలంగా టీఆర్‌ఎస్‌ పార్టీకి దూరంగా ఉంటున్న స్వామిగౌడ్‌ ఇప్పుడు బీజేపీ పంచన చేరారు. టీఎన్జీవో నేతగా, తెలంగాణ ఉద్యమంలో అనంతరం టీఆర్ఎస్ పార్టీలో స్వామిగౌడ్ చురుకైన పాత్ర పోషించారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమ్మిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. దీంతో ఆయనకు శాసనమండలి ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు.

ఆ పదవీ కాలం పూర్తి అయ్యాక ఆయనను టీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టింది. దాంతో కినుక వహించిన ఆయన బీజేపీ వైపు వెళ్లిపోయారు.  

Related posts

కడపనే అభివృద్ధి చేయలేని సీఎం జగన్

Bhavani

అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రం

Satyam NEWS

తెలంగాణ వ్యవసాయరంగం దేశానికే రోల్ మోడల్

Bhavani

Leave a Comment