తెలంగాణ శాసనమండలి మాజీ చైర్మన్ స్వామి గౌడ్ బీజేపీలో చేరారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకున్నారు.
కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్న స్వామిగౌడ్ ఇప్పుడు బీజేపీ పంచన చేరారు. టీఎన్జీవో నేతగా, తెలంగాణ ఉద్యమంలో అనంతరం టీఆర్ఎస్ పార్టీలో స్వామిగౌడ్ చురుకైన పాత్ర పోషించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కు నమ్మిన వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు. దీంతో ఆయనకు శాసనమండలి ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు.
ఆ పదవీ కాలం పూర్తి అయ్యాక ఆయనను టీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టింది. దాంతో కినుక వహించిన ఆయన బీజేపీ వైపు వెళ్లిపోయారు.