కారణజన్ముడు-గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యంకి స్వర నీరాజనం అర్పించింది తెలంగాణ పోలీసు శాఖ.
హైదరాబాద్ లోని పోలీస్ ఆఫీసర్స్ మెస్ వేదికగా ప్రముఖ నటుడు లోహిత్ ఆధ్వర్యంలో సాగిన ఈ స్వర నివాళికి ఐపిఎస్ అధికారి, జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ ఎం.రమేష్ సారధ్యం వహించారు.
27 మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్విరామంగా సాగిన ఈ కార్యక్రమంలో ఎం.రమేష్ స్వయంగా రెండు పాటలు ఆలపించడం విశేషం.
ప్రముఖ సంగీత దర్శకులు కోటి, విశ్రాంత ఐ.ఏ.ఎస్.అధికారి ఎల్.వి.సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
19 భాషల్లో 90 వేల పాటలు పాడి, భారతీయ సంగీతంపై చెరగని ముద్ర వేసిన ఎస్పీబీకి ‘భారతరత్న’ ఇవ్వాలని వక్తలు విజ్ఞప్తి చేశారు.