25.7 C
Hyderabad
May 9, 2024 08: 12 AM
Slider తెలంగాణ

నీట మునిగి ఆరుగురి దుర్మ‌ర‌ణం

drown

తెలంగాణలో వేర్వేరు చోట్ల స్నానానికి, ఈత‌క‌ని వెళ్లిన ఆరుగురు మ‌ర‌ణించారు.


ములుగురులో న‌లుగురు

ములుగు జిల్లాలో గోదావరిలో స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు గల్లంతయ్యారు. వెంకటాపురం మండలం మరికాల గోదావరి రేవు వద్ద శనివారం సాయంత్రం ఈ సంఘటన చోటుచేసుకుంది. రంగరాయపురం గ్రామానికి చెందిన 16 మంది గోదావరి స్నానానికి వెళ్లగా నలుగురు యువకులు గల్లంతయ్యారు. వారిలో శ్రీకాంత్, తుమ్మ కార్తీక్, అన్వేష్, ప్రకాష్‌ ఉన్నారు. ఈ ఘటనతో మరికాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.


కామారెడ్డిలో ఇద్ద‌రు యువ‌కులు


కామారెడ్డి జిల్లాలో నిజాంసాగర్‌ కాల్వలో ఈతకెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. ఐదుగురు యువకులు నిజాంసాగర్‌ ప్రాజెక్టు దిగువ ఉన్న నీటి గుంతలో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. స్థానికుల చొరవతో ముగ్గురు యువకులు సురక్షితంగా బయటపడగా.. ఇద్దరు చనిపోయారు. మృతదేహాలను స్థానిక మత్స్యకారులు బయటకు తీశారు. మృతులను సంగారెడ్డి జిల్లా కల్హెర్‌ మండలానికి చెందిన వారిగా గుర్తించారు.


పండుగ‌పూట ఈ విధానం నెల‌కొన‌డంతో చుట్టూ ప్ర‌క్క ప్రాంతాల్లో తీవ్ర విషాదం నెల‌కొంది. చేతికి అందివ‌చ్చిన యువ‌కులు మ‌ర‌ణించ‌డంతో ఆయా కుటుంబ స‌భ్యుల రోద‌న‌లు స్థానికుల‌ను క‌ల‌చి వేశాయి.

Related posts

బీజేపీ బ్రాండ్ అంబాసిడర్ లా మాట్లాడుతున్న కోమటిరెడ్డి

Satyam NEWS

దెయ్యమా.. ఏలియనా :ఝార్ఖండ్ చాడ్వా డ్యామ్ బ్రిడ్జిపై వింత ఆకారం

Satyam NEWS

నరసరావుపేటలో విజయవంతంగా జాబ్ మేళా

Satyam NEWS

Leave a Comment