అంతర్జాతీయ ఉగ్రవాది, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ తమ ఆశ్రయం కోరినట్లు వచ్చిన వార్తలను ఆఫ్ఘనిస్థాన్ లోని తాలిబాన్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. అఫ్ఘానిస్థాన్లో జైషే చీఫ్ అజర్ ఉన్నట్లు పాక్ మీడియాలో వార్తలు రావడం గమనార్హం. మసూద్ అజార్ను అప్పగించాలని డిమాండ్ చేస్తూ ఆఫ్ఘన్ తాలిబన్లకు పాకిస్థాన్ లేఖ రాసిందని కూడా నివేదికలు తెలిపాయి.
అంతకుముందు, పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు చెందిన ఒక ఉన్నత అధికారి మాట్లాడుతూ, “మేము ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఒక పేజీ లేఖ రాశాము, మసూద్ అజర్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాడని వచ్చినవాడని మేము భావిస్తున్నాము. అందువల్ల అతడిని గుర్తించి అరెస్టు చేయాలని వారిని కోరాము” అని చెప్పారు. (తూర్పు నంగర్హర్ ప్రావిన్స్) లో ఎక్కడో దాక్కున్నాడని కూడా పాకిస్తాన్ ఆ లేఖలో పేర్కొంది.
దీనిపై తాలిబాన్ తాత్కాలిక ప్రభుత్వ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ స్పందిస్తూ పాకిస్థాన్ను లక్ష్యంగా విమర్శలు చేశారు. పాకిస్థాన్ మీడియాలో వచ్చిన వార్తలను తాను చూశానని ఆఫ్ఘనిస్థాన్కు చెందిన టోలో న్యూస్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ముజాహిద్ చెప్పాడు. “కానీ, అది నిజం కాదు. మా నుండి ఎవరూ అలాంటి డిమాండ్ చేయలేదు. జైషే మహ్మద్ చీఫ్ ఆఫ్ఘనిస్థాన్లో లేడని ముజాహిద్ చెప్పాడు. ఇటువంటి సంస్థలు పాకిస్తాన్ నేల నుండి మాత్రమే పని చేస్తాయి తప్ప ఆఫ్ఘనిస్థాన్ లో పని చేయలేవని ఆయన వ్యాఖ్యానించారు.