తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి పలు ప్రజా హిత నిర్ణయాలు తీసుకుంటూ ప్రజల విమర్శకుల ప్రశంసలందుకుంటున్న ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి ఎం.కే. స్టాలిన్ మరోసారి ప్రజల మనస్సులు గెలుచుకున్నారు.
ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ కోయంబత్తూరులోని కోవిడ్ ఆస్పత్రులను ఆదివారం సందర్శించారు. ఇప్పటికే కోవిడ్ -19 వ్యాక్సిన్ యొక్క రెండు టీకాలని వేసుకున్న 68 ఏళ్ల తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కె స్టాలిన్ వ్యక్తిగత రక్షణ పరికరాలు (పిపిఇ కిట్ ) ధరించి ఆదివారం కోవిడ్ -19 వార్డును పారిశ్రామిక నగరమైన కోయంబత్తూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో సందర్శించి వైరస్ సోకిన రోగులలో భరోసా కల్పించారు.
ఆయా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కోవిడ్ రోగులను పరామర్శిస్తూ ,ఆయన ఆస్పత్రుల వార్డుల్లో కలియ తిరిగారు. రోగుల ఓదార్చుతూ ఆసుపత్రి నిర్వహణ వైద్యుల పని తీరును అడిగి తెలుసుకున్నారు. నిబంధనలను పక్కన పెట్టి మరీ ఆయన ఆస్పత్రులను సందర్శించారు.వైద్యులు, నర్సులు మరియు ఇతర ఫ్రంట్ లైన్ కార్మికుల “విశ్వాసాన్ని పెంచడానికి అయన ఆసుపత్రులను సందర్శించారని డీఎంకే ట్వీట్ చేసింది.