“సత్యం న్యూస్. నెట్” పరిశోధనలో తేలిందిదే…!
ఉభయ తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఉన్న ట్యాంక్ బండ్ ప్రతీ ఒక్కరికీ సుపరిచితమే. మరీ ముఖ్యంగా ఉమ్మడి ఏపీలో రాష్ట్ర విభజన సందర్భంలో అదే హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై చేసిన ఆందోళన ఏకంగా ప్రత్యేక రాష్ట్ర సాధనకు ”చేయూత”నిచ్చింది. అయితే ఆ సొది ఇప్పుడెందుకంటారా అని అనకండి…. అక్కడికే వస్తోంది”స సత్యం న్యూస్. నెట్”. అచ్చం హైదరాబాద్ ట్యాంక్ బండ్ మాదిరిగానే…. విజయనగరంలో పెద్ద చెరువు ఆనుకుని ఉన్న నాటి ఆచంట గార్డెన్… ను నేటిప్రజలకు ఉపయోగ పడేలా…స్తానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల.. దగ్గరుండీ దాని రూపురేఖలు మార్చేశారు. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో… పెద్ద చెరువు ఆనుకుని ఉన్న పురాతన కట్టడాన్ని కొత్త సొభగులతో విద్దుదీరకణ పెట్టి మరీ కొత్త కళను తెచ్చి… విజయనగరం రూపురేఖలే మారిపోయాయని” సత్యం న్యూస్. నెట్” స్వీయ పరిశోధనలో తేలింది.