31.2 C
Hyderabad
May 2, 2024 23: 51 PM
Slider కడప

పన్ను విధానాన్ని రద్దు చేయాలని టీడీపీ నేతల వినతి పత్రం

#TDP Kadapa

కడప జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ అద్వర్యంలో గురువారం మునిసిపల్ అధికారులకు వినతిపత్రాలను ఇచ్చే కార్యక్రమంలో భాగంగా రాజంపేట మునిసిపాలిటీ ఇన్ఛార్జ్ కి వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగింది.

గడచిన 15 నెలలుగా ప్రజలు కరోనా విపత్కర పరిస్థితులతో ఆదాయ మార్గాలు కోల్పోయి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులల్లో ఆస్థిపన్ను, నీటిపన్ను, చెత్తపన్ను, మరుగుదొడ్ల పన్ను అంటూ విపరీతంగా పెంచేస్తూ నూతన పన్ను విధానాన్ని ప్రవేశపెడుతూ రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ,నిరసిస్తూ నూతన పన్ను విధానాన్ని రద్దు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టారు.

టీడీపీ నేతలు డాక్టర్ సుధాకర్,సంజీవరావు,అబూబకర్,గుగ్గిళ్ళ చంద్రమౌళి, డి.ఆర్.యల్.మణి,మనుబోలు వెంకటేశ్వర్లు,ఇడిమడకల కుమార్,ఓదేటి హరి,నరసింహా తదితరులు పాల్గొన్నారు.

Related posts

Analysis: గవర్నర్ వ్యవస్థ బరువు కాదు బాధ్యత

Satyam NEWS

న్యూ ఇయర్ నేపథ్యంలో ఏపిలో కొత్త మద్యం బ్రాండ్లు

Bhavani

నిరాధార కుటుంబాన్ని ఆదుకున్న ప్రియనేస్తం చారిటబుల్ ట్రస్ట్

Satyam NEWS

Leave a Comment