29.7 C
Hyderabad
May 1, 2024 09: 21 AM
Slider కృష్ణ

న్యూ ఇయర్ నేపథ్యంలో ఏపిలో కొత్త మద్యం బ్రాండ్లు

మద్యంపై వచ్చే ఆదాయాన్ని పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకున్నది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 10 మద్యం బ్రాండ్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకున్నది. తమిళనాడుకు చెందిన ఎస్ఎన్‌జే షుగర్స్ అండ్ ప్రొడక్ట్ లిమిటెడ్ సంస్థతోపాటు మరికొన్ని మద్యం సరఫరా కంపెనీలకు సంబంధించిన ఈ కొత్త బ్రాండ్లకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ప్రస్తుతం కొన్ని కేటగిరీల బీరు ధర రూ. 200గా ఉంది.

ఇప్పుడు కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ల బీరు ధర రూ. 220గా ఉంది. అలాగే, కొన్ని కేటగిరీల్లో క్వార్టర్ మద్యం ధర రూ. 110గా ఉంటే, ఇప్పుడు కొత్తగా అనుమతి పొందిన బ్రాండ్ల మద్యం క్వార్టర్ ధర రూ. 130గా ఉంది. కొత్త సంవత్సరం వస్తున్న నేపథ్యంలో ఏపి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మద్యం ఆదాయం గణనీయంగా పెరగనున్నది.

Related posts

ఏటూరునాగారం రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

Satyam NEWS

Trespassing: కోర్టు ఆర్డర్ ఉన్నా యథేచ్ఛగా ఆక్రమణ

Satyam NEWS

మావోయిస్టు పటేల్ సుధాకర్ రెడ్డి కి ఘన నివాళి

Satyam NEWS

Leave a Comment