27.7 C
Hyderabad
May 4, 2024 07: 05 AM
Slider విజయనగరం

ఒక ఎమ్మల్యే, మేయ‌ర్, 49 మంది కార్పొరేట‌ర్లున్నా..ఏం ప్ర‌యోజ‌నం…?

#spandana

దాదాపు 4 కోట్ల 80 ల‌క్ష‌ల సోలార్ పవ‌ర్ ప్లాంట్ నిరుప‌యోగం….!

దాదాపు అయిదు కోట్ల వ్య‌యంతో న‌గ‌ర శివారు ద్వార‌పూడి కొండ‌పై నిర్మించిన సోలార్ విద్యుత్ ప్లాంట్  ఉప‌యోగానికి తీసుకురావాలంటూ  విజ‌య‌న‌గ‌రం లో టీడీపీ,…స్పంద‌న కార్య‌క్ర‌మంలో విన‌తి ప‌త్రం స‌మ‌ర్పించింది. 2017లో  టీడీపీ హయాంలో నిర్మించిన ఆ  సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్  ను ప్ర‌స్తుతం నిరుప‌యోగంలో ఉంద‌ని..త‌క్ష‌ణం వినియోగంలోకి తీసుకువ‌చ్చి  విద్యుత్ కొరత లేకుండా  చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టీడీపీనేత‌లు క‌న‌క‌ల‌,వి.ప్ర‌సాద్, ఐపీ రాజు త‌దిత‌రులు కోరారు.

ఈమేర‌కుక‌లెక్ట‌ర్ విజ్జాప‌ణ‌ప‌త్రం ఇచ్చిన అనంత‌రం క‌లెక్ట‌రేట్ వెలుప‌ల మీడియాతో మాట్లాడారు. విజ‌య‌న‌గ‌రానికి ఒక ఎమ్మెల్యే, ఒక మేయ‌ర్ ,49 మంది కార్పొరేటర్లు ఉన్నా…సుమారు 5కోట్ల వెచ్చించిన సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్ ను పున‌రుద్దించ‌లేక‌పోయారంటూన‌గ‌ర  టీడీపీ నేత క‌న‌క‌ల విమర్శించారు.అలాగే ఎమ్మెల్యే  ఆదేశాను సారంగా…ఒక మేయ‌ర్, 49 మంది కార్పొరేట‌ర్లు ఉన్నా..ఆ ప‌వ‌ర్ ప్లాంట్ మ‌ర‌మ్మ‌తులు చేయ‌కుండా మి్న్న కున్నార‌ని  ఆరోపించారు. అదొక్క‌టే కాదని..టీడీపీ చేప‌ట్టిన ప్ర‌తీ ప్రాజెక్టును నిరుప‌యోగంలోకి రాకుండా ఉండేందుకు  చూస్తున్నార‌ని  టీడీపీ విమ‌ర్శించింది. క‌నీసం…ఈ సోలార్ ప‌వ‌ర్ ప్లాంట్ పై నేనా దృష్టి పెట్టాల‌ని టీడీపీ కోరుతోంది.

Related posts

ఆత్మహత్య చేసుకున్న కొల్లాపూర్ ఎస్ఐ తండ్రి

Satyam NEWS

దేశమంటే మట్టికాదోయ్…దేశమంటే మనుషులోయ్..

Satyam NEWS

ఏజెన్సీలో విజయవంతంగా నడుస్తున్న ఆదివాసీల బంద్

Satyam NEWS

Leave a Comment