గిరిజన వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ నేడు ఆంధ్రా తెలంగాణ ఏజెన్సీ ప్రాంతాలలో బంద్ జరుగుతున్నది.
నాన్ షెడ్యూల్ గిరిజన గ్రామాలను షెడ్యూల్డ్ గ్రామాల్లో చేర్చాలని, పోలవరం నిర్వాసితులకు పూర్తిస్థాయి పునరావాసం కల్పించాలని ఆదివాసీలు డిమాండ్ చేస్తున్నారు.
జీవో నెంబర్ 3 సాధన కమిటీ మేరకు నేడు పూర్తి స్థాయిలో బంద్ ప్రారంభించారు మన్యంలో దుకాణాలు రవాణా సౌకర్యాలు నిలిపివేశారు.
జీవో నెంబర్ 3ని తక్షణమే పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు.
గిరిజనుల ఉద్యోగ హక్కును కాలరాసే విధంగా సుప్రీంకోర్టు తీర్పు ఉందని అందువల్ల తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం తక్షణమే రాజ్యాంగ సవరణ చేయాలని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని వారు డిమాండ్ చేశారు. గిరిజన స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు కోరుతున్నారు.