జిల్లా పరిషత్ చైర్మన్ వ్యాఖ్యలను ఖండించిన విజయనగరం టీడీపీ నేతలు
కేంద్ర మంత్రిగా…రాష్ట్ర మంత్రగా అటు ఎంపీగా ఇటు ఎమ్మెల్యేగా పని చేసిన అశోక్ గజపతి రాజు గారిపై లేని పోని అభాండాలు వేయడం ఎంత మాత్రం సబబు కాదని ఏపీలోని విజయనగరం టీడీపీ నేతలు..అధికార పార్టీ నేతలనుద్దేశించి మాట్లాడారు.
స్థానిక అశోక్ బంగ్లాలో టీడీపీ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలైన కనకల,తదితరులు మాట్లాడారు.పార్టీ సీనియర్ అశోక్ గురించి ..జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడం ఎంత మాత్రం తగదన్నారు.గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించి నట్టుంది….జిల్లా పరిషత్ చైర్మన్ వ్యాఖ్యలు ఉన్నాయని నేతలు ఆరోపించారు.
అశోక్ తండ్రి పీవీ రాజు సహితం..అధిక మొత్తం విద్యకే కేటాయించారని గుర్తు చేసారు..పార్టీ నేతలు. అసలు పూసపాటి వంశీయులంటే విద్యకు కళలకు ప్రాధాన్యత ఇచ్చేవారని… నాటి వారసత్వమే అశోక్ గజపతి రాజుకు వచ్చిందని…ఎమ్మెల్యేగా ఉన్నా.ఎంపీ గా ఉన్నా.. ఆ రెండింటికి అంటే అటు విద్య..ఇటు కళకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవారిని గుర్తు చేసారు.
అలాంటి అశోక్ గజపతి రాజునుద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం సబబు కాదన్నారు.తన రాజకీయచతురతతో సీఎం జగన్ వద్ద మొప్పు కొసం….అశోక్ నుద్దేశించి లేనిపోని వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం సమంజసంగా లేదన్నారు.
గతంలో అశోక్ గారి తండ్రి పీవీపీ రాజు వేలాది ఎకరాలను విద్యాలయాలకు దారాదత్తం చేసారని..ఈ రోజు అశోక్ ప్రజాస్వామ్యం లో విద్యకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని… తన 26 కోట్ల ఎంపీ నిధులలో సగ భాగం విద్యకే కేటాయించారని మరోసారి గుర్తు చేసారు..పార్టీ నేతలు.