తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినత్సవ కార్యక్రమం విజయనగరం.. జిల్లా పార్టీ కార్యాలయం అశోక్ బంగ్లాలో జరిగింది. ఈ కార్యక్రమంలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు పూసపాటి అశోక్ గజపతిరాజు పాల్గొన్నారు.నలభై ఏళ్ల పార్టీ ప్రస్థానం లో పార్టీ నే అంటి పెట్టుకుని ఉన్న అశోక్ గజపతిరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ… సేవ ,అంకిత భావం ప్రతీ ఒక్కరిలో ఉండాలన్నారు. పార్టీ కి చెందిన కొందరు… హైదరాబాద్ వెళ్లారని మరికొందరికి ఆరోగ్యం బాగోలేక వెళ్లలేదని అందులో నేనొకడినని పార్టీ పోలీట్ బ్యూరో సభ్యులు అశోక్ గజపతిరాజు పేర్కొనడం విశేషం.అనంతరం పార్టీ సీనియర్ కార్యకర్తలను సన్మానించడం జరిగింది.
previous post