31.7 C
Hyderabad
May 2, 2024 10: 02 AM
Slider కడప

పోలీసులు అధికారులు ప్రతిపక్షాలను భయపెడుతున్నారు

srinivasareddy

కడప జిల్లాలో అన్ని స్థానాల్లో టీడీపీ పోటీ చేస్తుందని టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యం ఎక్కువైందని ఆయన అన్నారు. అధికారులు, పోలీసు బలగంతో ఇతర పార్టీ నాయకులను భయ భ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు.

గ్రామాల్లోని విపక్ష నాయకులను పాత కేసుల పేరుతో భయపెడుతున్నారని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎన్నికలు సజావుగా జరిగే పరిస్థితి లేదని అధికారులు, పోలీసులు కేవలం అధికార పార్టీ కోసమే పనిచేస్తున్నారని ఆయన అన్నారు. దీని పై రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన అన్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, మునిసిపల్ ఎన్నికల్లో టీడీపీ అన్ని చోట్లా పోటీకి సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల్లో ప్రజా మద్దతుతో గెలవాలి కానీ, ప్రలోభాలతో కాదని వైసీపీ ఏకపక్ష నిర్ణయాలను ఖండిస్తున్నామని ప్రతిపక్ష పార్టీలను లేకుండా చేయాలని చూసిన ఏ ఒక్క పార్టీ ఇప్పుడు మనుగడలో లేదని ఆయన అన్నారు.

Related posts

ఎన్ పీ ఆర్ పై అవగాహన లేని నిర్ణయాలు

Satyam NEWS

ఫేక్ ఎలిమినేషన్ తో రివర్స్ ఓపీనియన్

Satyam NEWS

ఆరుగురు ఆడ‌పిల్ల‌లు…అంగవైకల్యంతో ఉన్న తండ్రి…..

Satyam NEWS

Leave a Comment