40.2 C
Hyderabad
May 1, 2024 16: 06 PM
Slider విశాఖపట్నం

జీఎంఆర్ పై టీడీపీ నేత ఘాటు విమర్శలు…..

#TDP

వ్యాపార వేత్తలు రాజకీయ నేతలు కాలేరని…ఏ ప్రభుత్వం వచ్చిన…. మాదీ వ్యాపారం.. మాకు సహకరించండని అంటారని టీడీపీ నేత మాజీమంత్రి కోండ్రు మురళీ అన్నారు. విజయనగరం లో అశోక్ బంగ్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మురళీ తో పాటు మాజీ ఎంఎల్సీ ద్వారపురెడ్డి జగదీష్,కోళ్ల లలిత కుమారి తదితర నేతలు మాట్లాడారు.

రాజాంకు చెందిన జీఎంఆర్… ప్రస్తుత సీఎం జగన్ తో ఉంటూ…భోగాపురం ఏర్ పోర్ట్ ను నిర్మిస్తున్న దరిమిలా.. ఏ విధంగా చూడొచ్చన్న మీడియా ప్రశ్నకు కోండ్రు మురళీ మాట్లాడారు. జీఎంఆర్… వైఎస్సార్ తో సంబంధాలు కొనసాగించే వారని… టీడీపీ మాత్రం ఓ వ్యాపార వేత్తగానే ఆయనను పరిగణిస్తుందన్నారు.

ఇక భోగాపురం వచ్చిన సీఎం జగన్ …ఏర్ పోర్టు ప్రారంభంతో ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని చెప్పడంలౌ అర్ధం లేదన్నారు. అసలు జగన్ ప్రభుత్వం వచ్చి నాలుగేళ్ళ వుతున్న…ఉద్యోగ శాతం శూన్యమేనని…కేవలం సచివాలయం వ్యవస్థ తీసుకోచ్చామని మాత్రం చెప్పడం సరికదాన్నారు.ఈ నాలుగేళ్లు రాని ఉద్యోగ అవకాశాలు… భోగాపురం ఏర్ పోర్ట్ నిర్మాణం పూర్తయ్యేసరికి వస్తాయంటే నమ్మొచ్చా అని మురళీ ప్రశ్నించారు.

Related posts

నగరి మున్సిపాలిటీలో మంత్రి రోజాకు మంగళహారతులు

Satyam NEWS

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ మొత్తంలో గంజాయి పట్టివేత

Satyam NEWS

భూపాలపల్లి కలెక్టర్ ను కలిసిన టీయూడబ్ల్యూజే నేతలు

Satyam NEWS

Leave a Comment