అసలే ఎండాకాలం… ఆ పై నెత్తిన పిడుగు పడినట్లు గా భానుడు భగభగ…ఈ సమయంలో భార్యా ,బిడ్డలతో బండిపై ప్రయాణం. ఆ సమయంలో పోలీసులు నడిరోడ్డుపై ఆపితే. …ఎవ్వరైనా ఆగ్రహంతో పోలీసులపైనే చిందులేస్తారు..ఆ పై అరుస్తారు..తప్పని తెలిసి…తప్పించుకునేందుకు…. ఉన్నతాధికారులకు ఓ ఎస్ఎంఎస్..లేక ఫోన్ కొడతారు. అయితే… మీరు చదవబోయే అంశం మాత్రం… క్యాప్షన్ లో అదే వార్త హెడ్డింగ్ లో చివరన తెలిపినట్లు గ..మద్యం సేవించి న వైనం.
అదే జరిగింది విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద.ట్రాఫిక్ విధులలో భాగంగా ఇటీవలే కంట్రోల్ రూం నుంచీ ట్రాఫిక్ విభాగంలో కి వచ్చిన ఎస్ఐ రాజు….డ్యూటీ లో భాగంగా ఎస్పీ ఆదేశాలు… ట్రాఫిక్ డీఎస్పీ సూచనలతో… నగరంలో ని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఓ వైపు చలానాలు రాస్తూ నే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ లు నిర్వహిస్తున్నారు..ట్రాఫిక్ ఎస్ఐ రాజు.
ఈ సమయంలో నే ఓ వ్యక్తి కుటుంబం తో బండిపై చీపురు పల్లి వెళుతూ ఉండగా…దూరం నుంచే ట్రాఫిక్ ఎస్ఐ రాజు….అతగాడి ని చూసి అనుమానం తో డీడీ తనిఖీ చేసారు. బాపురే 400 ఎంఎల్ ఉండటంతో కేసు కట్టారు.
అయితే వెంట అతగాని భార్య, ఇద్దరు పిల్లలు ఉండటం… విషయం ఏంటని…ట్రాఫిక్ ఎస్ఐ రాజు…అతగాడి భార్య ను అడగగా ..నిన్న టి నుంచీ తాగుతున్నారని చెప్పడంచో…భార్య, పిల్లలను పుట్టింటికి సారిపల్లి పంపించి అతగాడిని…వన్ టౌన్ ను అప్పచెప్పారు.