చిత్తూరు జిల్లా మాజీ ఎమ్.ఎల్.ఏ, టిడిపి జాతీయ ఉపాధ్యక్షురాలు సత్యప్రభ కన్నుమూశారు. అనారోగ్యంతో చికిత్స పొందుతూ బెంగళూరు వైదేహి అసుపత్రిలో మృతి చెందారు.
కరోనా బారిన పడి కోలుకుని, మళ్లీ అనారోగ్యానికి గురైన సత్యప్రభ మరణించినారు. మాజీ ఎంపీ, టిటిడి చైర్మన్ గా పనిచేసిన డీకే ఆదికేశవులు సతీమణి సత్యప్రభ. 2013లో డీకే ఆదికేశవులు మరణించారు.
గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి తరపున రాజంపేట లోక్ సభ అభ్యర్థిగా పోటీ చేసి సత్యప్రభ ఓడిపోయారు.