కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి సిద్ధం అవుతుందని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఈవో అధర్ పూనావాలా వెల్లడించారు.
ఆక్సఫర్డ్ సంస్థతో కలిసి సీరం ఇన్ స్టిట్యూట్ కరోనా వ్యాక్సిన్ సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ ధర డోసు ఒక్కటి వెయ్యి రూపాయల వరకూ ఉంటుందని ఆయన తెలిపారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికే ఆరోగ్య కార్యకర్తలకు తమ వ్యాక్సిన్ అందిస్తామని పూనావాలా తెలిపారు. సాధారణ ప్రజానీకానికి మాత్రం ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.
ప్రతి వ్యక్తి రెండు డోసులు వేసుకోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. భారత్ లో అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే 2024 వరకూ పడుతుందని ఆయన తెలిపారు.