32.7 C
Hyderabad
April 27, 2024 01: 25 AM
Slider జాతీయం

Good News: కరోనా వ్యాక్సిన్ డోసు వెయ్యి రూపాయలు

#corona vaccine

కరోనా వ్యాక్సిన్ వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి సిద్ధం అవుతుందని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సిఈవో అధర్ పూనావాలా వెల్లడించారు.

ఆక్సఫర్డ్ సంస్థతో కలిసి సీరం ఇన్ స్టిట్యూట్ కరోనా వ్యాక్సిన్ సిద్ధం చేస్తున్న విషయం తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ ధర డోసు ఒక్కటి వెయ్యి రూపాయల వరకూ ఉంటుందని ఆయన తెలిపారు.

వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికే ఆరోగ్య కార్యకర్తలకు తమ వ్యాక్సిన్ అందిస్తామని పూనావాలా తెలిపారు. సాధారణ ప్రజానీకానికి మాత్రం ఏప్రిల్ నాటికి అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.

ప్రతి వ్యక్తి రెండు డోసులు వేసుకోవాల్సి ఉంటుందని ఆయన వెల్లడించారు. భారత్ లో అందరూ కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలంటే 2024 వరకూ పడుతుందని  ఆయన తెలిపారు.

Related posts

డిప్యూటీ స్పీకర్ గా విజయనగరం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల‌

Satyam NEWS

సమాచార హక్కు చట్టం జుక్కల్ బాధ్యుల నియామకం

Satyam NEWS

ఆలయాల్లో హుండీ చోరీ చేస్తున్న ఐదుగురి అరెస్టు

Satyam NEWS

Leave a Comment