39.2 C
Hyderabad
May 3, 2024 13: 24 PM
Slider ముఖ్యంశాలు

మునుగోడు ఉప ఎన్నిక లో టీఆరెఎస్ విజయం

#munugodu

మునుగోడు ఉప ఎన్నిక లో టీఆరెఎస్ అభ్యర్ధి కుసుకుంట్ల ప్రభాకర్రెడ్డి విజయం సాధించారు. సమీప అభ్యర్ధి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి(బిజెపి) పై టీఆరెఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి 11,666 ఓట్లతో విజయం సాధించారు. 15 రౌండ్ల పాటు సాగిన కౌంటింగ్ లో అన్నీ రౌండ్లలోనూ ప్రభాకర్ రెడ్డి కె మెజారిటీ వచ్చింది. కాంగ్రెస్స్ అభ్యర్ధి స్రవంతి కి డిపాజిట్ రాలేదు. మునుగోడు గెలుపుతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించిన టీఆరెఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నారు. హుజూర్ నగర్,నాగార్జున సాగర్,మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆరెఎస్ వరుసగా గెలిచింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని క్లీన్ స్వీప్ చేసేసిన టీఆరెఎస్. తాజా గెలుపు తో 12 నియోజకవర్గాల్లో 12 మంది టీఆరెఎస్ ఎమ్మెల్యేలే వున్నట్లైంది. ప్రభాకర్ రెడ్డి కి 97,006 ఓట్లు, బి‌జే‌పి అభ్యర్ధి రాజగోపాల్రెడ్డి కి 86,697 ఓట్లు, కాంగ్రెస్స్ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి కి 23,906 ఓట్లు వచ్చాయి. కె ఏ. పాల్ కు 600 వోట్లు మాత్రమే వచ్చాయి.

Related posts

గిరిజన జాతిని మోసం చేసిన సీఎం కేసీఆర్

Satyam NEWS

మంచిర్యాల జిల్లాలో ఘోర ప్రమాదం: ఇద్దరు మృతి

Bhavani

కువైట్ లో నందమూరి అభిమానుల సేవానిరతి

Satyam NEWS

Leave a Comment