సిద్ధిపేట జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి కెనాల్లోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సిద్ధిపేట జిల్లాలోని జగదేపూర్ మండలం మునిగడప వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అటుగా వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడి కెనాల్ లోకి దూసుకెళ్లింది.
ఘటన జరిగిన సమయంలో కారులు ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఐదుగురు మృతి చెందగా,ఒకరికి పరిస్థితి విషమంగా ఉందని, ఆసుపత్రికి తరలించామని పోలీసులు వెల్లడించారు.