పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గుంటూరు రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన జిందాల్ స్టీల్స్ షాప్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారి వ్యాపారం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం 29వ వార్డ్ ఇంఛార్జి బత్తుల విష్ణు గారి మాతృమూర్తి బత్తుల అచ్చమాంబ గారు ఈ రోజు ఉదయం కన్నుమూశారు.
శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వారి ఇంటికి వెళ్ళి అచ్చమాంబ గారి భౌతిక కాయానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం రొంపిచర్ల మండలం సుబ్బయ్యపాలెం గ్రామంలో గాడపర్తి వెంకట రావు గారి పెద్ద కర్మ సందర్భంగా మండల నాయకులతో కలిసి గాడపర్తి వెంకట రావు గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.