34.2 C
Hyderabad
May 14, 2024 22: 30 PM
Slider ముఖ్యంశాలు

ప్రొటెస్టు: ప్రజా వ్యతిరేక పాలనపై టీడీపీ మహాధర్నా

katragadda prasuna

రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలనలో సాగుతున్న ప్రజావ్యతిరేక విధానాలపై తెలుగుదేశం పార్టీ భారీ నిరసన ధర్నా నిర్వహించింది. హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ వద్ద నేడు జరిగిన ఈ మహాధర్నాలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సీనియర్ నాయకుడు రావుల చంద్రశేఖరరెడ్డి, టిడిపి అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన, అరవింద్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న కాట్రగడ్డ ప్రసూన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలన కారణంగా ఎంతో మంది సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె అన్నారు.

ప్రజల సమస్యలు తీర్చడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆమె అన్నారు. సామాన్య ప్రజల ఆకాంక్షలు తీర్చడంలో ఇప్పటికైనా శ్రద్ధ చూపాలని ఆమె కోరారు.   

Related posts

పెద్దకొత్తపల్లి గురుకుల విద్యార్థికి హైజంప్ లో గోల్డ్ మెడల్

Satyam NEWS

అటవీ క్షేత్రాధికారుల ప్రవేశ శిక్షణా కార్యక్రమ ప్రారంభం

Bhavani

ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన హైకోర్టు

Satyam NEWS

Leave a Comment