ఈ నెల 17న విజయనగరం జిల్లా కు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో జిల్లా పార్టీ నేతలు అలెర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో టీడీపీ నియోజకవర్గ ఇంచార్జిణ ఆదితీగజపతిరాజు పార్టీ కార్యకర్తలతో నగరంలో ని దాసన్నపేట ప్రాంతాన్ని పరిశీలించారు.
ఈ మేరకు పార్టీ నేతలతో ఆదితీగజపతిరాజు బాబు పర్యటించనున్న ప్రదేశాన్ని..పరిశీలించి.. రోడ్ షో ఏ విధంగా ఉండాలన్నదానిపై అక్కడికక్కడే చర్చించారు.. ఆదితీగజపతిరాజు. అనంతరం ఆమె మీడియా తో మాట్లాడుతూ.. బాబు పర్యటన దృష్ట్యా.. దాసన్నపేట లో స్ధల పరిశీలన చేసామని… ఇక్కడ నుంచీ నెల్లిమర్ల, చీపురుపల్లి వెళతారన్నారు.
చీపురు పల్లి లి రోడ్ షో పెట్టడానికి ప్రత్యేకత లేదన్నారు. రాష్ట్రంలో జగన్ పాలన ఎంత అధ్వాన్నంగా ఉందనేది చెప్పడానికే బాబు యాత్ర కు శ్రీకారం చుట్టారని ఆదితీ అన్నారు.