35.2 C
Hyderabad
May 9, 2024 16: 26 PM
Slider అనంతపురం

జగన్ బాదుడు తో జనం విలవిల..

#TDP

సీఎం జగన్ మోహన్ రెడ్డి బాదుడుతో జనం విలవిలాడుతున్నారని టిడిపి రాజంపేట సీనియర్ నాయకులు చమర్తి జగన్ మోహన్ రాజు ఆరోపించారు. బుధవారం అన్నామయ్య జిల్లా వీరబల్లి మండలంలోని దిగువ రాచపల్లె గ్రామంలోని పెద్దూరు కస్పా, బలిజపల్లె, కల్లెవాండ్లపల్లె, మాదావాండ్లపల్లెలో బాదుడే-బాదుడు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి రాజంపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు చమర్తి జగన్ మోహన్ రాజు హాజరయ్యారు. ప్రతి ఇంటికి వెళ్లి బాదుడే-బాదుడు కరపత్రాలను పంపిణీ చేస్తూ పెరిగిన ధరల గురించి ప్రజలకు తెలియజేశారు.

ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేష స్పందన లభించింది. ఆ గ్రామాల ప్రజలు ఈ సంధర్భంగా ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆ సమస్య లను ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ముస్లిం మైనారిటీలు, బీసీలు, ఎస్సీ లతో పాటు అన్ని వర్గాల ప్రజల ను ఈ ప్రభుత్వం మోసం చేసిందని ఆయన విమర్శించారు. గత మూడున్నర సంవత్సరాలుగా ధరలు పెంచుకుంటూ పోవడం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు.

ధరల బాదుడుతో ప్రజలు విసిగిపోయారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు యం.భానుగోపాల్ రాజు, ప్రధాన కార్యదర్శి సురేంద్ర, మహిళా అధ్యక్షురాలు నాగసుబ్బమ్మ, వార్డు మెంబర్లు రామాంజనేయులు, సలీం, మాజీ సర్పంచ్ లు బొంగాని మల్లికార్జున, నేతి పిచ్చోల్ల వెంకటరమణ, టిడిపి సీనియర్ నాయకులు వెంకట్రామ రాజు, రామ్మోహన్ రెడ్డి, జయచంద్రా రెడ్డి, నాగసుబ్బయ్య నాయుడు, నయం యల్లయ్య, రామాంజనేయులు, సుబ్బరాయుడు, బాషు, ప్రసాద్ రాజు, సుదర్శన్ రాజు, రమేష్, సుధాకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు నాగమల్లయ్య, ఆంజనేయులు రెడ్డి, రాజా రాజు, ప్రసాద్ రాజు, ప్రభాకర్ నాయుడు, భాస్కర్ రాజు, లక్ష్మీ రెడ్డి, సిధ్ధిరాజు, డ్రైవర్ శివ, సుబ్బరామరాజు, సుధాకర్, రామకృష్ణం రాజు, సీతారామరాజు, నరసింహులు, రమణ, ఐటిడిపి పవన్, మణికంఠ, ఎస్సీ నాయకులు ఆంజనేయులు, జనార్ధన్, నాగేంద్ర, సతీష్, నత్తిపూజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Related posts

హుమాయూన్ నగర్ లో కంటేన్ మెంట్ జోన్

Satyam NEWS

గెస్ట్ లెక్చరర్ల నియామకానికి గ్రీన్ సిగ్నల్

Bhavani

కాంగ్రెస్ నేత ఆఫీసులో ఎన్నికల అధికారుల సోదాలు

Satyam NEWS

Leave a Comment