మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అసెంబ్లీలో జరిగిన తీవ్ర అవమానానికి నిరసనగా తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం లో టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. గండేపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోహన్ రావు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. ఈ సందర్భంగా పోతుల మోహన్ రావు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి అన్న నందమూరి తారక రామారావు కుమార్తెను ఈ విధంగా అవమానించడం బాధాకరమని అన్నారు.
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తను మరలా ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీలో అడుగు పెడతానని అనడంతో ఆ మాటకు తామందరం కట్టుబడి ఉన్నామని అన్నారు. ప్రతి కార్యకర్త ఆయన ను ముఖ్యమంత్రి చేయడానికి నిరంతరం పని చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజు బొల్లంరెడ్డి రామకృష్ణ, శీల మంతుల వీరబాబు, బొళ్ళ సతీష్, గొల్లవిల్లి అన్నవరం మరిసా శ్రీనివాస్ తెలుగుదేశం కార్యకర్తలు పాల్గొన్నారు.