42.2 C
Hyderabad
May 3, 2024 18: 34 PM
Slider గుంటూరు

రమ్య కుటుంబానికి న్యాయం చెయ్యాలని తెలుగుదేశం పార్టీ కొవ్వొత్తుల నిరసన

#tdpprotest

గుంటూరులో హత్యకు గురైన రమ్య కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. టీడీపీ శ్రేణులు భారీగా పాల్గొని కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన లో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమానికి ర్యాలీ గా బయలుదేరిన వారిని భారీగా మోహరించిన పోలీసులు అడ్డుకున్నారు. నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు, తెలుగు మహిళా నేతలు దాసరి ఉదయ్ శ్రీ, మనుకొండ జాహ్నవి, టీ ఎన్ ఎస్ ఎఫ్ నేత కురపాటి హనుమంతరావు, మక్కెన ఆంజనేయులు, కొల్లి బ్రహ్మయ్య, చల్లా సుబ్బారావు, బడే బాబు, శాఖమురి మారుతి, యాడ్స్ వాలి, మెడబలిమి నవీన్, బంగారం తదితరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.

Related posts

కరోనా నేపథ్యంలో ఆందోళనలో వాలంటీర్లు

Satyam NEWS

గొర్రెలు, మేకలలో సామూహిక నట్టల నివారణ

Satyam NEWS

కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment