కొల్లాపూర్ మండలం మినుముటి వద్ద కలప తరలింపును అడ్డుకున్న ఫారెస్టు అధికారులపై స్మగ్లర్లు దాడి చేశారు. ఈ దాడిలో ఫారెస్ట్ సెక్షన్ అధికారి వెంకటేష్ , బీట్ అధికారి స్వామిలు తీవ్రంగా గాయపడ్డారు. ఏడుగురు స్మగ్లరు వెంకటేష్ ,స్వామి పై దాడి చేసి పరారయ్యారు. ఫారెస్ట్ ఆఫీసర్ లు వెంకటేష్ ,స్వామి కు గాయాలతో ఆసుపత్రికి తరలించారు. దాడి చేసిన నిందితులను లింగాల ప్రాంతానికి చెందిన వారని, వారిని లింగాల పోలీస్ లు అదుపులోకి తీసుకున్నట్లు కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజర్ శరత్ చంద్ర రెడ్డి తెలిపారు.