తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్బంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసారు.
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని తెరాస పార్టీ కార్యలయం వద్ద, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయ పథకం ఆవిష్కరణ చేసి అనంతరం కొయ్యగుట్ట అమరవీరుల స్థూపం వద్ద పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి, అంబేద్కర్ చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
అదే విధంగా ఉద్యమకారుడు కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, ఎంపీపీ దొడ్ల నీరజ వెంకట్ రామ్ రెడ్డి, జడ్పీటీసీ పద్మా గోపాల్ రెడ్డి, బాన్సువాడ మండల తెరాస పార్టీ అధ్యక్షులు మోహన్ నాయక్ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్, ఏఎంసీ చైర్మన్ పాత బాలకృష్ణ, ప్యాక్స్ చైర్మన్ కృష్ణ రెడ్డి, పిట్ల శ్రీధర్, మండల పార్టీ కార్యదర్శి రాజేశ్వర్ గౌడ్, తెరాస పార్టీ మండల నాయకులు దొడ్ల వెంకట్ రామ్ రెడ్డి, ఎజాజ్, గోపాల్ రెడ్డి, అలీముద్దీన్ బాబా, మున్సిపల్ వైస్ చైర్మన్ జుబేర్, మున్సిపల్ కౌన్సిలర్లు, నార్ల ఉదయ్, ఇలియాజ్, కార్యకర్తలు పాల్గొన్నారు.