తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో, టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద శాసనసభ సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి నివాళులు అర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ హుజూర్ నగర్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతోమంది త్యాగధనులు పోరాడి తెచ్చుకున్న తెలంగాణ సీఎం కెసిఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణగా రూపు దిద్దుకోవడం జరుగుతుందని అన్నారు.
ఎన్నో ఏళ్ల సుదీర్ఘ పోరాటంతో ఏర్పడిన తెలంగాణ ప్రపంచ స్థాయిలో అభివృద్ధి పథంలో ఓ గుర్తింపు సాధిస్తుందని,అన్ని వర్గాల ప్రజలను కలుపుకుంటూ దేశంలోనే నెంబర్ వన్ గా సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం నిలుస్తుందని అన్నారు.
కరోనా సమయంలో ప్రజలు కరోనాకి దూరంగా ఉండాలంటే సామాజిక దూరం పాటిస్తూ,ప్రతీ ఒక్కరూ మాస్క్ లు,శానిటేజర్ వాడాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కడియం వెంకట్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ గేల్లీ అర్చన రవి, జెడ్పిటిసి కొప్పుల సైదిరెడ్డి, వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు, ఎంపీపీ శ్రీనివాస్,పట్టణ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి,ప్రధాన కార్యదర్శి అమర్,పట్టణ పార్టీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.