రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
కరోనా రెండో దశ ఉధృతంగా వున్న ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నికలకు ఎందుకు వెళ్లారని హైకోర్టు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని నిలదీసింది.
ప్రజల ప్రాణాలంటే లెక్క, విలువ లేదా అని ప్రశ్నించింది. యుద్ధం వచ్చినా.. ఆకాశం మీద పడినా ఎన్నికలు జరగాల్సిందేనా అని అసహనం వ్యక్తం చేసింది.
ఎస్ఈసీ అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులు గమనిస్తున్నారా? ఎస్ఈసీ అధికారులు భూమిపై నివసిస్తున్నారా?
ఆకాశంలోనా?అని అడిగింది కొర్టు.కొన్ని మున్సిపాలిటీల ఎన్నికలకు ఇంకా సమయం ఉంది కదా అయినా తొందరెందుకు అని చీవాట్లు పెట్టింది.
ప్రభుత్వ అభిప్రాయంతోనే ఎన్నికలు పెట్టామన్న ఎస్ఈసీ వాదనతో ఏకీభవించని హైకోర్టు ఫిబ్రవరి లోనే కరోనా రెండోదశ మొదలైందని ఏప్రిల్లో నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారని అడిగింది.