28.7 C
Hyderabad
April 27, 2024 06: 10 AM
Slider నల్గొండ

జిల్లా కేంద్రాలలో సరిపడ లేబర్ అధికారులను నియమించాలి

#hujurnagarcitu

సూర్యాపేట జిల్లాలో హెల్పర్ కార్డులను త్వరితగతిన ఇచ్చేందుకు సరిపడిన లేబర్ అధికారులను ఏర్పాటు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యలక సోమయ్య గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శిల్పకళా సంఘ కార్యాలయంలో బుధవారం జరిగిన జనరల్ బాడీ సమావేశంలో సోమయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వారికి వివిధ రూపాలలో లబ్దిదారులకు లేబర్ అధికారులు లేక కార్మికులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.

కరోనా లాక్ డౌన్ సమయంలో భవన నిర్మాణ కార్మికులకు,హెల్పర్ బోర్డులో ఉన్న ప్రతి ఒక్కరికి 1500 రూపాయలు ఇస్తానన్న టిఆర్ఎస్ ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వకపోవడం అన్యాయమని అన్నారు.సమస్యల పరిష్కారం కొరకై     ఈనెల 28న,చలో హైదరాబాద్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు కదలి రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి,ఉప్పతల వెంకన్న,గోవిందు, షేక్.ముస్తఫా,శీలం వేణు,నాగరాజు, బాబులు,చిన్న కొండలు,లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

శ్రీకాకుళం నగర పాలక సంస్థలో అభివృద్ధి పనులు వేగవంతం చేయండి

Satyam NEWS

20 తర్వాత కంటైన్ మెంట్ జోన్లలో మినహాయింపు ఉండదు

Satyam NEWS

బెయిల్ రద్దుకు నిరాకరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం

Satyam NEWS

Leave a Comment