తెలంగాణా ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ (టీపీజీఎల్) నిర్వాహకులు హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ రెండవ సీజన్ పోటీలను ప్రారంభించబోతున్నట్లు నేడు వెల్లడించారు. నేడు జరిగిన పాత్రికేయుల సమావేశంలో హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ అధ్యక్షులు జయంత్ ఠాగోర్, హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ హానరరీ సెక్రటరీ డి. వందిత్ రెడ్డి తో పాటుగా ఈ లీగ్కు టైటిల్ స్పాన్సర్, శ్రీనిధి యూనివర్శిటీ చైర్మన్ డాక్టర్ కె.టి. మహీ పాల్గొన్నారు.
హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ అధ్యక్షులు జయంత్ ఠాగోర్ మాట్లాడుతూ ‘‘ ఈ గోల్ఫ్ లీగ్కు ప్రోత్సహమందిస్తూ మద్దతునందించిన తెలంగాణా ప్రభుత్వం మరియు తెలంగాణా పర్యాటక శాఖకు ధన్యవాదాలు. తెలంగాణా ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ను హైదరాబాద్ గోల్ఫ్ అసొసియేషన్ నిర్వహిస్తుంది. దీనిద్వారా జంట నగరాలలో గోల్ఫింగ్ను తీసుకురావడంతో పాటుగా అత్యున్నత స్ధాయి అవగాహనను సైతం తీసుకురానున్నాం. అలాగే మరెన్నో బృందాలు దీనిలో పాల్గొనేలా చేస్తున్నాం’’ అని అన్నారు.
హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ హానరరీ సెక్రటరీ డి. వందిత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘తెలంగాణా ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ సీజన్ 2కు అపూర్వమైన స్పందన లభించింది. మొత్తంమ్మీద 16 టీమ్లు పాల్గొంటుండగా, శ్రీనిధి యూనివర్శిటీ రెండు సీజన్లకూ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తుంది. తెలంగాణా ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ను అపూర్వ విజయం సాధించేలా తోడ్పాటునందించిన స్పాన్సర్లందరికీ ధన్యవాదములు. పోటీతత్త్వంతో గోల్ఫ్ ఆడేందుకు,తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకునేందుకు ఇది ఓ గొప్ప అవకాశం’’ అని అన్నారు.
‘‘స్థానిక సమజానికి ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటుగా గోల్కండ చుట్టు పక్కల ప్రాంతాలను అభివృద్ధి చేయడం వల్ల భారతదేశంలో అత్యుత్తమ గోల్ఫ్ కోర్స్లలో ఒకటిగా హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ను నిలిపేందుకు తమకు సహాయపడింది. జీవనోపాధికి మద్దతు అందించడం ద్వారా సమాజానికి తిరిగివ్వడం, గోల్ఫ్ సంస్కృతిని ప్రోత్సహించడం హెచ్జీఏ వద్ద తమ అందరికీ గర్వకారణం’’ అని అన్నారు.
16 టీమ్లు:
శ్రీనిధియన్ థండర్బోల్ట్స్, టీమ్ టీ ఆఫ్, మహీ మాస్టర్స్, వర్ధమాన్ ఈగల్ హంటర్స్, వ్యాలీ వారియర్స్, దేవ్ పిక్సెల్ డెవిల్స్, టీమ్ ఎలగన్స్, క్లాసిక్ చాంప్స్, గ్లెనడెల్ గోల్ఫ్ర్స్, అపోలో క్యాన్సర్ క్రూసెడర్, టీమ్ లబోనెల్, ఎంవైకె సై్ట్రకర్స్, విల్లాజియో హై ల్యాండర్స్, మైసా, ఏజిల్స్ డర్టీ డొజెన్, కెఎల్ఆర్ కింగ్స్
Please Visit https://tpgl.in/
For more details, please contact: KALYAN CHAKRAVARTHY @ 9381340098