29.7 C
Hyderabad
May 2, 2024 06: 48 AM
Slider నిజామాబాద్

బాన్సువాడ అభివృద్ధి పనులపై స్పీకర్ సమీక్ష

#PocharamSrinivasaReddy

కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను తెలంగాణ రాష్ట్ర శాసనసభ సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఈరోజు పరిశీలించారు.

ముందుగా నూతన పురపాలక భవనం స్థలం చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీ గోడను, పాత అంగడి బజారులో నిర్మిస్తున్న నూతన చేపల మార్కెట్ ను పరిశీలించారు.

పనులను త్వరితంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ఎర్రమన్ను కుచ్చ కాలనీలో నూతనంగా నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ళను పరిశీలించారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా DCCB చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, పురపాలక సంఘం చైర్మన్ జంగం గంగాదర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పీకర్ వెంట ఉన్నారు.

Related posts

హైవే క్లోజ్:చినకాకాని వద్ద ఆగిపోయిన వాహనాలు

Satyam NEWS

కరోనా ఇన్ఫెక్షన్ గరిష్ట స్థాయికి చేరిన చైనా

Satyam NEWS

కరోనాతో ఒకే రోజు నలుగురు జర్నలిస్టుల మృతి

Satyam NEWS

Leave a Comment