పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సుప్రీంకోర్టు అనుమతించడం ప్రజాస్వామ్య విజయం అని కడప జిల్లా రాజంపేట తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల రాయుడు వ్యాఖ్యానించారు.
సోమవారం నాడు ఆయన టీడీపీ కార్యాలయం లో మీడియా సమావేశం నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పడం డాక్టర్ అంబేద్కర్ రాజ్యాంగ విజయమని ఆయన అన్నారు.
నియంతలకు గుణపాఠం అని బత్యాల వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్య వాదులు సంబరాలు చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
దేశం కోసం ప్రాణాలు ఇచ్చే జవానులను రాష్ట్ర ఉద్యోగులు ఆదర్శంగా తీసుకోవాలని, జైలు కెళ్ళి వచ్చిన నేతలను కాదని హితవు పలికారు.
ప్రభుత్వం ఉద్యోగులను బ్రాందీ షాపుల వద్ద కాపలా వేస్తే ప్రశ్నించకుండా నిమ్మగడ్డ ను ప్రశ్నించడం తప్పని అన్నారు. ఇప్పటికయినా ప్రభుత్వం సక్రమంగా ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు.
ఇంకా ఈ సమావేశంలో టీడీపీ శ్రేణులు డాక్టర్ సుధాకర్,వేణు గోపాల్, ఇడిమడకల కుమార్,మందా శ్రీను,మంద పల్లె శ్రీను,సంజీవ రాయుడు,అనసూయమ్మ తదితరులు పాల్గొన్నారు.