38.2 C
Hyderabad
April 29, 2024 20: 02 PM
Slider గుంటూరు

పౌరసత్వ చట్టంపై జగన్ ది రెండు నాల్కల ధోరణి

chadalavada 27

పౌరసత్వ సవరణ చట్టంపై వైసిపి రెండు నాల్కల ధోరణి అవలంబిస్తున్నదని నరసరావుపేట నియోజకవర్గం టీడీపీ ఇన్చార్జి  డాక్టర్ చదలవాడ అరవింద బాబు అన్నారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని పాత 07 వార్డ్ లోని ఇస్లాంపేట్ లో నాల్గోవ రోజు ప్రజా చైతన్య యాత్ర జరిగింది.

NRC వద్దు అమరావతి ముద్దు అనే నినాదంతో  ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ చదలవాడ స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ సీఏఏ, ఎన్ఆర్సీసి అమలు పై ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ముస్లింలను మోసగించేందుకు తెగబడుతున్న జగన్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించక తప్పదు అని అన్నారు.

సి ఏ ఏ బిల్లుకు పార్లమెంటులో విప్ జారీ చేసి మరీ మద్దతు తెలిపిన వైసిపి, రాష్ట్రంలో మాత్రం వ్యతిరేకం అంటూ రెండు నాలుకల ధోరణి అవలంబిస్తోందని అన్నారు. ముస్లింలను మోసగించేందుకు ఉపయోగపడుతున్న జగన్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని డాక్టర్ చదలవాడ అన్నారు.

గురువారం సాయంత్రం పట్టణంలో 07, 08 వార్డులో  ప్రజా చైతన్య నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పట్టణ పార్టీ అధ్యక్షులు కడియాల రమేష్ బాబు, శేఖర్, బాషా తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉగ్రవాదుల యాప్ లను బ్యాన్ చేసిన కేంద్రం

Satyam NEWS

కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

Satyam NEWS

ఒకరికి కరోనా వచ్చిందని తెలియగానే మిగతా వారు ఏం చేయాలి?

Satyam NEWS

Leave a Comment