42.2 C
Hyderabad
May 3, 2024 18: 45 PM
Slider ఆధ్యాత్మికం

బ్రహ్మం గారి మఠం లో తెరుచుకున్న ఆలయం

#Brahmamgari Matham

కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కాలజ్ఞాని బ్రహ్మంగారి సజీవ సమాధి ఉన్న ఆలయాన్ని ఎండోమెంట్ అధికారులు తెరిచారు. మఠంలో కరోనా కేసులు పెరగడం, ఆలయ పరిసర ప్రాంతాల్లో కోవిడ్ కేసులు నమోదు కావడంతో వారం రోజుల కిందట ఆలయాన్ని మూసివేశారు. 

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తిరిగి ఆలయంలోని సోమవారం నుంచి భక్తులను అనుమతిస్తున్నారు. జీవసమాధిని సందర్శించే ప్రతి భక్తుడిని థర్మో స్కానింగ్ ద్వారా జ్వరం లక్షణాలను పరిశీలించి, చేతులను శానిటైజ్ చేసిన తరువాతనే లోనికి అనుమతిస్తున్నారు.

కొబ్బరి కాయల నివేదన, తీర్థ ప్రసాదాలను నిషేధించారు. కేవలం ఆలయాన్ని దర్శించేందుకు మాత్రమే అనుమతిస్తున్నారు. ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడి వివరాలను రికార్డు చేస్తున్నారు. కరోనా భయంతో భక్తులు కొద్ది సంఖ్యలో బ్రహ్మంగారి దర్శనానికి వస్తున్నారు.

Related posts

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో పోలీసు కస్టడీలో జేసీ

Satyam NEWS

సందిగ్ధం నుంచి సగం క్లారిటీ వచ్చిన సెల్ఫ్ డిస్మిసల్

Satyam NEWS

150 లీటర్ల మజ్జిగ పంపిణీ కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment