ఆన్ లైన్ క్లాస్ ల పేరుతో విద్యార్ధుల తల్లిదండ్రుల నుంచి లక్షల రూపాయలలో ఫీజులు వసూలు చేస్తున్న సంస్థలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని టిఎస్విఏసీ, ఓయు జెఏసీ ఆరోపించాయి. ఈ మేరకు వారు నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లోని డిప్యూటీ డిఈవో కార్యాలయం వద్ద వారు కొద్ది సేపు ధర్నా నిర్వహించారు. అనంతరం డిఈవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు డి శ్రీకాంత్, శశిపాల్, హరీష్, రంజిత్, నవీన్, రాహుల్ తదితరుల పాల్గొన్నారు.