పల్నాడు జిల్లా కారంపూడి పట్టణంలో గర్రె కళ్యాణ్ సంతోష్ కుమార్ జ్ఞాపకార్థం 150 లీటర్ల మజ్జిగ పంపిణీ సేవా కార్యక్రమం నిర్వహించారు. గాంధీ బొమ్మ సెంటర్ లో ఏర్పాటుచేసిన చలివేంద్రం వద్ద 150 లీటర్ల మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వేసవిలో జిల్లా వాసవి సేవాదళ్ కారంపూడి వాసవి సేవాదళ్ మహిళా విభాగ్ పర్యవేక్షణ చేసే సేవా కార్యక్రమాల్లో లో దాతలు స్పందించి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది.
ఈ కార్యక్రమంలో గర్రె రామారావు ధర్మపత్ని వెంకట లక్ష్మీనారాయణమ్మ ,గుంటూరు జిల్లా వాసవి సేవాదళ్ జిల్లా అధ్యక్షులు బవిరి శెట్టి రామారావు, సూరే పరమేశ్వరరావు, కారంపూడి మహిళా విభాగ్ అధ్యక్షురాలు గుండా నాగమల్లేశ్వరి, ప్రధాన కార్యదర్శి చిన్ని లక్ష్మి ,ట్రెజరర్ మాడిశెట్టి పుష్పలత, నాళం. ఆదిలక్ష్మి,డి. కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.