ఆర్టీసీ బస్సుల యాక్సిడెంట్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సు ను చూస్తే ప్రజలు భయపడుతున్నారు. నేడు మలక్ పేట్ దిల్ సుఖ్ నగర్ ప్రధాన రహదారి పై భారీ ప్రమాదం తృటిలో తప్పింది. బస్ స్టాప్ లో ఆగి ఉన్న బస్సును మరో ఆర్టీసీ బస్సు వచ్చి ఢీ కొట్టింది. ఈ ఘటన లో ఎటువంటి ప్రాణ నష్టం కాలేదు ప్రయాణీకులు చిన్న చిన్న గాయాలతో బయటపడ్డారు. రోడ్ పై ఆగిన బస్సు ని మరో ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ ఢీ కొట్టడం జరిగింది.
తాత్కాలిక డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగింది అని బస్సు లో ప్రయాణిస్తున్న ప్రయాణికులు వాపోయారు. వేగంగా వెనుక నుండి వచ్చి కంట్రోల్ తప్పడం తో ముందున్న బస్సును ఆ బస్పు ఢీ కొట్టింది. ఈ ఘటన తో మలక్ పేట దిల్ సుఖ్ నగర్ ప్రధాన రహదారి లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. మలక్ పేట్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.