దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకురాలు షర్మిల హుజూర్ నగర్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం రానున్నట్లు హుజూర్ నగర్ నియోజకవర్గ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇంచార్జ్ ఆదెర్ల శ్రీనివాస రెడ్డి తెలిపారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ నేరేడుచర్ల మండలం లోని మేడారం గ్రామానికి ఉదయం 10 గంటల 30 నిముషాలకు చేరుకుని నిరుద్యోగ సమస్యతో బాధపడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించిన నీలకంఠ సాయి అనే నిరుద్యోగ యువకుడికి దైర్యాన్ని కల్పించి నేనున్న అని బరోసా కల్పిస్తారని అన్నారు.
అనంతరం మధ్యాహ్నం 12 గంటల 30 నిముషాలకు హుజూర్ నగర్ కు చేరుకుని ఇందిరా చౌక్ లో వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిస్తారని,తదుపరి ముఖ్య కార్యకర్తలతో మాట మంతి నిర్వహించి తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మేళ్ళచెరువు మీదుగా చింతలపాలెం మండలం దొండపాడు గ్రామానికి చేరుకుని ఇటీవల మరణించిన రిటైర్డ్ ఎక్సైజ్ ఐజి, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి సన్నిహితుడు గున్నం నాగిరెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని అన్నారు. అక్కడి నుండి రామాపురం మీదుగా హైద్రాబాద్ చేరుకుంటారని ఆదెర్ల శ్రీనివాస రెడ్డి తెలిపారు.
వైఎస్ షర్మిల పర్యటన సందర్భంగా నియోజకవర్గంలోని వై.యస్.ఆర్ అభిమానులు, షర్మిల అభిమానులు, నాయకులు,కార్యకర్తలు,సానుభూతిపరులు కరోనా నిబంధనలకు అనుగుణంగా మాస్కులు ధరించి వైయస్ షర్మిల కు ఘన స్వాగతం పలకాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు మేరెడ్డి ఎల్లారెడ్డి,రాజా రమేష్, శాసనాల అంజి,చారి,కోటి,నున్న రామారావు,అహ్మద్, కందుల నరసింహ రెడ్డి, హాసన్, నాని, బలుసుపాటి రవి,బాపనపల్లి రవీందర్,కారింగుల హరీశ్,పిక్కిలి మహేష్, జనార్ధన్ రెడ్డి,సతీష్ రెడ్డి,గోవర్ధన్ రెడ్డి,నాగరాజు,నరసింహారెడ్డి,గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.