చేనేతన్ళకు “చేయూత” ఇచ్చేందుకే రాష్ట్ర మంతటా చేనేత వస్త్ర ప్రదర్శనలను రాష్ట్ర చేనేత వస్త్ర శాఖ ఏర్పాట్లు చేస్తోందని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి అన్నారు. గతేడాది ఇదే సమయంలో ఇక్కడే ఈ విధంగా నే చేనేత వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది ని డిప్యూటీ స్పీకర్ గుర్తు చేశారు. చేనేతన్న కష్టాలు సీఎం జగన్ కు తెలుసునని..ప్రభుత్వం కూడా నేతన్న పథకం ద్వారా చేనేత కార్మికులను ఆదుకుంటోందని డిప్యూటీ స్పీకర్ కోలగట్ల అన్నారు. ఈ మేరకు విజయనగరం మెసా నిక్ టెంపుల్ లో జిల్లా చేనేత జౌళి శాఖ ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శన నను ఎంపీ తో కలిసి ప్రారంభించిన అనంతరం డిప్యూటీ స్పీకర్ మాట్లాడారు. అంతకుముందు విజయనగరం ఎంపీ మాట్లాడుతూ.. కేంద్రం కూడా చేనేత ను ప్రోత్సహిస్తోందని…తదనుగుణంగా జిల్లా లో చేనేత కార్మికులకు మరిన్ని పధకాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని ఈ సందర్భంగా అన్నారు.
previous post