హర్యానా లో జరుగుతున్న ఆల్ ఇండియా షహీద్ భగత్ సింగ్ క్రికెట్ అండర్-18 ట్రోఫీలో పాల్గొనేందుకు హర్యానా వెళ్ళిన సి.ఎఫ్.ఐ జాతీయ చైర్మన్, మాజీ రాజ్యసభ సభ్యులు వి.హనుమంత రావు గురువారం సి.ఎఫ్.ఐ ప్రతినిధులతో కలిసి హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ను చండీగఢ్ రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా గవర్నర్ దత్తాత్రేయకి శాలువా కప్పి పుల బౌకే ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం దత్తాత్రేయ వి.హెచ్ మరియు సి.ఎఫ్.ఐ బ్రుందని శాలువా కప్పి మెమెంటో అందజేశారు. సిఎఫ్ఐ వర్కింగ్ ప్రెసిడెంట్ శంబుల శ్రీకాంత్ గౌడ్, ప్రెసిడెంట్ సాదిక్ పాష, సెక్రటరీ జనరల్ అమర్జీట్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ జగ్నరయన్ విశ్వకర్మ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సత్యం న్యూస్, అంబర్పేట