తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం పీఆర్సీ ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కు టీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు పిడమర్తి చంద్రయ్య ధన్యవాదములు తెలిపారు. అదే విధంగా నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రులు తమ అభివృద్ధిని కాంక్షిస్తూ పల్లా రాజేశ్వర్ రెడ్డిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోమారు గెలిపించారని ఆయన అన్నారు.
పల్లా రాజేశ్వర్ రెడ్డిని తిరిగి ఎమ్మెల్సీగా గెలిపించినందుకు హుజూర్ నగర్ బార్ కౌన్సిల్ న్యాయవాదులు, టిఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో పట్టభద్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ హుజూర్ నగర్ బార్ అసోసియేషన్ కార్యాలయంలో మిఠాయిలు పంచుకుని తమ హర్షాన్ని తెలియజేశారు.
ఈ సమావేశంలో బార్ అసోసియేషన్ సెక్రటరీ జక్కుల నాగేశ్వర్ రావు,అంబటి శ్రీనివాస్ రెడ్డి, చల్లా కృష్టయ్య , కొణతం శ్రీనివాసరెడ్డి,బాణాల శంకర్, ఆర్.వీ రమణా రెడ్డి,నాగార్జున,సురేష్ నాయక్, వట్టికూటి అంజయ్య,కొట్టు సురేష్, మీసాల అంజయ్య, రామలక్మా రెడ్డి,శ్రీను నాయక్,ఉస్సేన్, సుందర్రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.