40.2 C
Hyderabad
April 29, 2024 15: 21 PM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో మరింత పెరిగిన భక్తుల రద్దీ

#Tirumala

తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగింది. వీకెండ్ కావడంతో తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టుమెంట్లన్నీ క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం 70,896 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.07 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 37,546 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

శ్రీవారిని దర్శించుకున్న శర్వా దంపతులు. శ్రీవారి అభిషేక సేవలో పాల్గొని స్వామి వారిని హీరో శర్వానంద్ దంపతులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఏపీ హైకోర్టు సీజే ఏ.వి శేష సాయి, ఏపీ హైకోర్టు జడ్జి రవినాథ్ తిలహరి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు.

Related posts

తొలి ఆటబొమ్మ అమ్మ

Satyam NEWS

ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపిన బీజేపీ కార్పొరేట‌ర్‌

Sub Editor

అర్ధంతరంగా తనువు చాలించిన చదువుల తల్లి

Satyam NEWS

Leave a Comment