38.2 C
Hyderabad
April 27, 2024 16: 17 PM
Slider ముఖ్యంశాలు

ఐటీ దాడుల్లో కొత్త ట్విస్ట్..బయటపడ్డ రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగోతం ?

#BRS leaders

తెలంగాణ ఐటీ దాడుల్లో కొత్త ట్విస్ట్..బయటపడ్డ రియల్ ఎస్టేట్ బిజినెస్ బాగోతం గత 3 రోజులుగా బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి చెందిన ఇళ్లు, హైదరాబాద్ లోని కార్యాలయాల్లో ఈ తనిఖీలు జరుగుతున్నాయి.

అయితే ఈ రైడ్స్ మొదలైన దగ్గరి నుంచి ఎలాంటి విషయాలు బయటకు రాలేదు. ఈ క్రమంలో వరుసగా ఐటీ అధికారులు రైడ్స్ చేస్తున్నారు. ఇక ఈ తనిఖీల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

బీఆర్ఎస్ నేతల ఇళ్లలో చేసిన రైడ్స్ ఆధారంగా లైఫ్ స్టైల్ యజమాని గజ్జల మధుసూదన్ రెడ్డి ఇంట్లో అధికారులు సోదాలు చేపట్టారు. ఆయన హైదరాబాద్ శివారులో గల భూములను అమ్మకానికి పెట్టినట్లు సమాచారం.

ప్రభుత్వ భూమిని తీసుకుని రియల్ ఎస్టేట్ సంస్థలకు అమ్మినట్లు ఈ భూమిలో బీఆర్ఎస్ నేతలు రియల్ ఎస్టేట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు మధుసూదన్ రెడ్డితో పైళ్ల శేఖర్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాపారం చేసినట్లు ఐటీ అధికారులు గుర్తించారు. ఈ రైడ్స్ ముగిస్తే గాని కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Related posts

ప్రతిభ కనబర్చిన 28 పోలీసు సిబ్బంది కి అవార్డులు

Bhavani

దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

Bhavani

ఉద్యోగార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి!

Satyam NEWS

Leave a Comment